
మెరుగైన వైద్య సేవలు అందించాలి
నారాయణపేట: ప్రతి గ్రామంలో మెరుగైన వైద్య సేవలు అందాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట మండలంలోని అప్పక్పల్లి వద్ద గల ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్తోపాటు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, కాళోజి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రన్ఫర్ హెల్త్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వైద్య కళాశాల విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఒకే సంవత్సరంలో ఎంబీబీఎస్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీని ప్రారంభించామని, త్వరలో మదర్ ఆండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. వైస్ ఛాన్స్లర్ డాక్టర్ నందకుమార్ మాట్లాడుతూ.. నారాయణపేట మెడికల్ కాలేజీ పురోగతిలో ఉందని, కళాశాలకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, లైబ్రరీకి అవసరమైన 4 వేల పుస్తకాలను పంపిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పర్యావరణవేత్త కే పురుషోత్తం రెడ్డి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ దాసరి ప్రసాద్రావు, డాక్టర్ విజయ్ సీనియర్ జర్నలిస్టు పంతంగి రాంబాబు,సామాజిక వేత్త కుంభం శివకుమార్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి , రెడ్ క్రాస్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, వైద్య నిపుణులు ఆదిత్య, చంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు.
పేదల కడుపునింపేందుకే..
నర్వ: పేదల కడుపునింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నర్వ మండలంలోని లంకాల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారు రేణుక ఇంట్లో భోజనం చేశారు. అనంతరం గ్రామంలో రూ.20 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులు, అంగన్వాడీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనువాసులు, ఏఓ అఖిలారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్, శ్రీనివాస్రెడ్డి, కృష్ణారెడ్డి,శరణప్ప, బీసం రవికుమార్, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.