
నష్టపోయాం
నేను 3 ఎకరాల్లో మల్బరీ సాగు చేశాను. 150 గుడ్లకు రికార్డు స్థాయిలో బైవోల్టెన్లో 140 కిలోల పట్టుగూళ్లు ఉత్పత్తి చేశాను. ఇటీవల హిందూపురం మార్కెట్లో కిలో రూ.550 ప్రకారం విక్రయించాను. గతంలో కిలోకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 ఇంటెన్సివ్ ఇచ్చేది. ఈ రాయితీ లేకపోవడంతో రూ.7,000 నష్టపోయాం. పట్టు సాగులో పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉంది. రాయితీలను పెంచాలి. – పి.నన్నేసాహెబ్,
నరసాపురం, వెల్దుర్తి మండలం
చర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలో మల్బరీ సాగుకు ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది జిల్లాలో 150 ఎకరాల్లో మల్బరీ ప్లాంటేషన్ చేయాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు 18 ఎకరాల్లో చేపట్టాం. ఇంకా సమయం ఉంది. కనీసం 100 ఎకరాల వరకు ప్లాంటేషన్ చేపడుతాం. రైతులను గుర్తిస్తున్నాం.
– ఆంజనేయులు,
జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి, కర్నూలు

నష్టపోయాం