
నందీశ్వరుడికి ప్రదోషకాల అభిషేకం
మహానంది: మహానందీశ్వరస్వామి గర్భాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందీశ్వరస్వామికి సోమ వారం సాయంత్రం ప్రదోష కాలంలో విశేష ద్రవ్యాభిషేకం నిర్వహించారు. వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, మహానందీశ్వర ఆలయ అర్చకులు మూలస్థానం సుబ్బయ్యశర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ పి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ముందుగా గణపతిపూజ, పంచామృతాలు, విశేష ద్రవ్యాలు, వట్టివేర్లతో పాటు క్షీరాభిషేకం చేశారు. పలు ప్రాంతాల భక్తులు ప్రత్యక్ష, పరోక్ష సేవల ద్వారా నందీశ్వరాభిషేకం వీక్షించి స్వామివారి పూజలో పాల్గొన్నారు.
శ్రీశైలానికి స్వల్పంగా తగ్గిన వరద
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. గత ఆదివారం ఎగువ ప్రాజెక్ట్ల నుంచి 76,178 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చింది. జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సుంకేసుల నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. దీంతో ఆదివారం నుంచి సోమవారం వరకు 60,336 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదనను గత ఐదు రోజుల నుంచి నిలిపివేశారు. బ్యాక్ వాటర్ నుంచి కూడా దిగువ ప్రాంతాలకు నీటిి విడుదల నిలిలిచిపోయింది. సోమవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 97.1760 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 857 అడుగులకు చేరుకుంది.
పంచమఠాల్లోవిశేష పూజలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో లోకకల్యాణార్థం పంచమఠాల్లో సోమవారం అభి షేకం, పుష్పార్చనలు చేపట్టారు. ఉదయం ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠాలలో పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. లోక కల్యాణార్థం ప్రతి సోమవారం ఉదయం పంచమఠాలలోని దేవతామూర్తులకు విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. క్షేత్రన్ని సందర్శించే భక్తులు పంచమఠాలను కూడా దర్శించే విధంగా భక్తులలో అవగాహన కల్పించేందుకు చర్యల ను తీసుకుంటామన్నారు. ఈ పూజా కార్యక్రమంలో స్వామివార్ల ప్రధానార్చకులు హెచ్.వీరయ్య స్వామి, ఆలయ విభాగం ఏఈవో ఎం.హరిదాసు, పర్యవేక్షకులు కె.శివప్రసాద్, ఆలయ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఖాతాలకు ఎన్పీసీఐ లింకు తప్పనిసరి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు తల్లికి వందనం నిధులు విడుదల కావాలంటే తల్లి పోస్టల్ లేదా బ్యాంకు ఆధార్ నెంబర్ ఖాతాలకు ఎన్పీసీఐ లింక్ చేయాలని ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికా రిణి కె.తులసీ దేవి తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఎంపీడీఓ, ఏఎస్డబ్ల్యూఓ, గ్రామ/వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు తమ పరిధిలోని అర్హత కలిగిన విద్యార్థులను గుర్తించి ఎన్పీసీఐ లింకు చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు 9, 10 తరగతులకు చెందిన 164 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ పెండింగ్లో ఉందన్నారు. అలాగే 764 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లుల ఖాతాలకు కూడా ఎన్పీసీఐ లింక్ కాలేదన్నారు.
ఆశా కార్యకర్త పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల ఉద్యో గాల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ పి.శాంతికళ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 32, పట్టణ ప్రాంతాల్లో 12 ఖాళీలు ఉన్నాయన్నారు. అభ్యర్థుల విద్యార్హత లు, జీతం మొదలైన వివరాలు, దర ఖాస్తు నమూనాలు https://kurnool.ap.gov.in వెబ్సైట్లో ఉంచామన్నారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

నందీశ్వరుడికి ప్రదోషకాల అభిషేకం