
కోలుకోలేక ఉపాధి కూలీ మృతి
కృష్ణగిరి: మండలంలోని అమకతాడు గ్రామానికి చెందిన ఉపాధి కూలీ మానుకింది అనసూయమ్మ (42) కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతి చెందింది. ఈసీ మధు తెలిపి న వివరాలు.. శుక్రవారం గ్రామ సమీపంలో కాలువ వద్ద జరుగుతున్న ఉపాధి పనులకు హాజరైన అనసూయమ్మ పనిచేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైంది. హుటా హుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతుండగా అదే రోజు రాత్రి ఫిట్స్ రావడంతో కోలుకోలేక మృతి చెందినట్లు వైద్యు లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త రామాంజనేయులు, కు మారుడు, కుమార్తె ఉన్నా రు. మృతురాలికి ప్రభు త్వం ద్వారా వచ్చే సహా య సహకారాలకు సిఫా రసు చేసినట్లు ఈసీ తెలిపారు.