విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి

May 1 2025 1:01 AM | Updated on May 1 2025 1:01 AM

విద్య

విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి

బొమ్మలసత్రం: పట్టణంలోని ఓ కోచింగ్‌ సెంటర్‌కు చెందిన విద్యార్థిని నేత్ర(24) విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టూటౌన్‌ సీఐ ఇస్మాయిల్‌ తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లికిచెందిన నేత్ర గత కొంత కాలంగా పట్టణంలోని ఓ బ్యాంక్‌ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటుంది. అయితే సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటుంది. హాస్టల్‌కు సమీపంలో ఉన్న విద్యుత్‌ వైర్లపై ప్రమాదవశాత్తు చేయి తగిలి అక్కడికక్కడే కుప్పకూలింది. హాస్టల్‌ నిర్వాహకులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే నేత్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక 26వ తేదీ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కుక్కను తప్పించబోయి..

కర్నూలు: కర్నూలు బళ్లారి చౌరస్తా సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వెనుక జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామానికి చెందిన మండ్ల పరుశురాముడు (26) కర్నూలు నగరంలోని సాయికృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలో నివాసముంటాడు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాదు వైపు నుంచి కర్నూలులోకి వచ్చే సర్వీసు రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వెనుక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్‌పై స్నేహితుడు ఎల్లా నాయుడుతో కలసి వస్తూ ఆంజనేయస్వామి గుడి వద్ద అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డాడు. బైక్‌ నడుపుతున్న పరుశురాముడు తలకు బలమైన గాయం కావడంతో అ క్కడికక్కడే చనిపోయాడు. వెనుక కూర్చున్న ఎల్లా నాయుడుకు స్వ ల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరుశురాముడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. మృతునికి ఇంకా వివాహం కాలేదు. ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పిడుగుపాటుకు జీవాలు మృతి

అవుకు:చెన్నంపల్లి గ్రామంలో బుధవారం పిడుగుపాటుకు నాలుగు జీవాలు మృతి చెందాయి. బాధితులు తెలిపిన మేరకు.. సింగన పల్లె గ్రామా నికి చెందిన కొత్తపేట ప్రసాదు తన భార్య నాగలక్ష్మితో కలిసి జీవాలను చెన్నంపల్లె గ్రామ సమీపంలో జీవాలను మేపుతుండగా ఉరుములతో నాలు గు జీవాలు మృతి చెందాయని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి 1
1/1

విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement