సుబ్రమణ్యేశ్వరుడి హుండీ ఆదాయం రూ.20.53 లక్షలు | - | Sakshi
Sakshi News home page

సుబ్రమణ్యేశ్వరుడి హుండీ ఆదాయం రూ.20.53 లక్షలు

Mar 28 2023 1:04 AM | Updated on Mar 28 2023 1:04 AM

 హుండీల్లో కానుకలు లెక్కిస్తున్న దృశ్యం   - Sakshi

హుండీల్లో కానుకలు లెక్కిస్తున్న దృశ్యం

పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి హుండీ కానుకలు లెక్కించగా రూ.20.53 లక్షల ఆదాయం వచ్చింది. సోమవారం ఈఓ రామకృష్ణ ఆధ్వర్యంలో హుండీ కానుకలు లెక్కించగా రూ. 20,53,832 నగదు, మూడు గ్రాముల బంగారు, 1.760 కేజీల వెండి వచ్చింది. గత డిసెంబర్‌ నెల నుంచి సోమవారం వరకు భక్తులు సమర్పించిన కానుకలను దేవదాయశాఖ జిల్లా కార్యాలయ అధికారి చక్రభరత్‌ పర్యవేక్షణలో లెక్కించారు. హుండీ లెక్కింపులో గ్రామ పెద్దలు క్రిష్ణారెడ్డి, శివరామిరెడ్డి, మిలటరీ సుబ్బారెడ్డి, వెంకటసుబ్బయ్య, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement