నల్లగొండ టౌన్ : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న సామ్రాజ్యవాద యుద్ధాన్ని వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్క్రతిక సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు విమలక్క మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఆధిపత్యం కోసం ఇరాన్పై దాడులు చేస్తూ వందలాది మందిని హత్య చేస్తున్నాయన్నారు. ఈ యుద్ధాన్ని ప్రజాస్వామికవాదులు, మేధావులు ఖండించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కాకి భాస్కర్, చింతమల్ల గురూజీ, వీరస్వామి, సి.అనిత, పల్లెబోయిన జానీ, బొమ్మకంటి కొమరయ్య, బంటు రామలింగయ్య, వెంకటేశ్వరరావు, జహీరాబేగం, రాజు, వెంకటయ్య, నరసయ్య పాల్గొన్నారు.


