భూభారతి అర్జీలను వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భూభారతి అర్జీలను వెంటనే పరిష్కరించాలి

Jun 27 2025 4:10 AM | Updated on Jun 27 2025 4:10 AM

భూభారతి అర్జీలను వెంటనే పరిష్కరించాలి

భూభారతి అర్జీలను వెంటనే పరిష్కరించాలి

నల్లగొండ: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులపై సమీక్షిస్తామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో 45,313 దరఖాస్తులు వచ్చాయని వీటిని ఆగస్టు 14లోపు పరిష్కరిస్తామన్నారు. దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తుదారుకు నోటీసు జారీచేసి విచారణ చేసిన తర్వాత వారం సమయం ఇచ్చి ఆ తర్వాత పరిష్కరించాలన్నారు. అదనపు ఇన్‌చార్జి కలెక్టర్‌ నారాయణ అమిత్‌ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల్లో 15వేలు మిస్సింగ్‌ సర్వే నంబర్లవే ఉన్నాయన్నారు. ఆర్డీఓలు అర్హత ఉన్న దరఖాస్తుల వివరాలు మాత్రమే భూభారతిలో నమోదు చేయాలన్నారు. సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ, ఎమ్మార్వోలు పాల్గొన్నారు.

ఫ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement