మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Jun 27 2025 4:10 AM | Updated on Jun 27 2025 4:10 AM

మాదకద

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

నల్లగొండ : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పోలీస్‌, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఎన్‌జీ కళాశాల నుంచి క్లాక్‌ టవర్‌ వరకు చేపట్టిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నల్లగొండలోని ప్రకాశం బజార్‌లో డిజిటల్‌ తరగతులతోపాటు, అన్ని సౌకర్యాలతో నూతన పాఠశాల నిర్మిస్తున్నామని తెలిపారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ విక్రయాల గురించి తెలిసివారు డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్‌ శంకర్‌నాయక్‌, అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ అమిత్‌, అదనపు ఎస్పీ రమేష్‌, డీఈఓ భిక్షపతి, డీఎస్పీ శివరాంరెడ్డి, సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జూకూరి రమేష్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఫ నల్లగొండలో అంతర్జాతీయ డ్రగ్స్‌ వ్యతిరేక ర్యాలీ

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి 1
1/1

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement