
సగటు వర్షపాతం.. 8.3 మిల్లీమీటర్లు
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 8.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చందంపేట మండలంలో 37.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గుండ్లపల్లిలో 31.0, నేరెడుగొమ్ములో 29.5, పెద్దవూరలో 16.1, పీఏపల్లిలో 15.4, తిప్పర్తిలో 15.9, కేతేపల్లిలో 15.9, నకిరేకల్లో 14.3, దామరచర్లలో 13.6, మిర్యాలగూడలో10.4, శాలిగౌరా రంలో 11.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కట్టంగూరులో 7.3, నల్లగొండలో 3.7, కనగల్లో 3.6, మునుగోడులో 1.1, చండూరులో 3.9, చింతపల్లిలో 1.5, నాంపల్లిలో 0.2, గు ర్రంపోడు 3.0, అనుముల హాలియా 3.1, నిడమనూరులో 2.2, త్రిపురారంలో 3.4, మాడుగులపల్లిలో 4.7, వేముపల్లిలో 4.0, అడవిదేవులపల్లిలో 4.1, తిరుమలగిరి సాగర్లో 2.9, కొండమల్లెపల్లిలో 1.9, దేవరకొండలో 8.0 గుడిపల్లిలో 2.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దేవరకొండ డివిజన్లో అధిక వర్షం కురిసింది.
ప్రతి పేషెంట్కు ‘ఆభా’
ఐడీ క్రియేట్ చేయాలి
దేవరకొండ : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రతి పేషెంట్కు తప్పనిసరిగా ఆయుస్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఆభా) ఐడీ క్రియేట్ చేయాలని డీసీహెచ్ఎస్ మాతృనాయక్ అన్నారు. గురువారం దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆరోగ్యశ్రీ సిబ్బందితో వేర్వేరుగా సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసేవల కోసం ఆస్పత్రికి వచ్చేవారి పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవల్లో దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రి ముందుందన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాష్, సిబ్బంది ఉన్నారు.
రాజీవ్ యువ వికాసాన్ని ప్రారంభించాలి
నల్లగొండ టౌన్: ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే ప్రారంభించి అర్హులకు ఇవ్వాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ అన్నారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఉపాధి కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. సమావేశంలో రవినాయక్, మల్లం మహేష్, పతని శ్రీను, కట్ట లింగస్వామి, వడ్డగాని మహేష్, మహ్మద్ ఆక్రమ్, పాలది కార్తీక్, వంశీ, ఏడుకొండలు, బొడ్డుపల్లి నరేష్, బూర్గు గోపి కృష్ణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

సగటు వర్షపాతం.. 8.3 మిల్లీమీటర్లు