
తనిఖీలతో బోధనకు ఆటంకం
బాధ్యతలు వీరికే..
పాఠశాలల తనిఖీలకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో పదేళ్లు అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లను నియమించుకోవాల్సి ఉంటుంది. వీరిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు రోజుకు రెండు పాఠశాలలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల్లో 50 ఉన్నత పాఠశాలలను తనిఖీ చేయించాలనేది విద్యా శాఖ నిర్ణయం. అయితే అర్హతల ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఎంపిక చేయనుంది. ఇదిలా ఉంటే ఓ ఎస్జీటీ మరో ఎస్జీటీ మీద, ఒక స్కూల్ అసిస్టెంట్.. మరో స్కూల్ అసిస్టెంట్ మీద తనిఖీలు చేయడం సరైంది కాదని ఉపాధ్యాయులు గొనుక్కుంటున్నారు.
నల్లగొండ: ఒకపక్క గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల ఏర్పాటు అవడం..మరోపక్క పట్టణాల్లోని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రతి గ్రామానికి బస్లు పంపుతూ ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తుండడంతో అధిక శాతం తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా అడ్మిషన్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితిని అధిమించేందుకు రాష్ట్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలను రోజూ తనిఖీ చేయడం ద్వారా విద్యా ప్రమాణాలు పెరుగుతాయని భావించింది. అందుకు తనిఖీల బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ కమిటీతో తనిఖీ బాధ్యతలకు ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. అయితే విద్యా శాఖ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యాయులు తనిఖీలు చేసేందుకు వెళ్తే బోధన కుంటుపడుతుందని అంటున్నారు.
ఫ స్కూళ్ల పర్యవేక్షణకు టీచర్లకు బాధ్యతలు
ఫ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ
ఫ ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలని సర్కారు యోచన
ఫ వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
జీహెచ్ఎంలు 178 ఎల్ఎఫ్ఎల్ 164
ఎస్ఏలు 2,278 ఎల్పీలు 97
ఎస్జీటీలు 2,729 పీఈటీలు 151
ఇతరులు 15 మొత్తం 5,612