ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ ముస్తాబు

Dec 29 2025 9:08 AM | Updated on Dec 29 2025 9:08 AM

ముక్కోటి ఏకాదశికి  మన్యంకొండ ముస్తాబు

ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ ముస్తాబు

మహబూబ్‌నగర్‌ రూరల్‌: ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ముస్తాబు అయ్యింది. ప్రతి ఏడాది దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగే వేడుకలకు దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారు హనుమద్దాసుల మండపంలో కొలువుదీరి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారు. ఉదయం 6.30 గంటలకు స్వామివారి శేషవాహన సేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారిని హనుమద్దాసుల మండపం వద్దకు తీసుకువచ్చి అలంకరించి విశేష పూజలు జరుపుతారు. ఈ వేడుకలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. దిగువకొండ వద్దనున్న అలివేలు మంగతాయారు దేవస్థానంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని దేవస్థానం చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement