
అమిత్షా వ్యాఖ్యలు సరికాదు : మంత్రి
నాగర్కర్నూల్ రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్పై కేంద్ర మంత్రి అమిత్షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే రాజేష్రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీం, జై అచ్చితసంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గగ్గలపల్లి శివారులోని ఓ కన్వెన్షన్లో జరిగిన సమావేశంలో ఆయనతో పాటు ఎంపీ డా. మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని రాజ్యాంగ ప్రతిజ్ఞ చేసి అక్కడి నుంచి గగ్గలపల్లికి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి ఆయనతో పాటు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కించపర్చే విధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.