
పురాతన ఆలయాలు చరిత్రకు ప్రతిరూపాలు
ములుగు రూరల్: పురాతన ఆలయాలు చరిత్రకు ప్రతిరూపాలని తెలంగాణ రాష్ట్ర పురావస్తుశాఖ సంచాలకులు ప్రొఫెసర్ అర్జునరావు కూతాడి అన్నారు. శుక్రవారం మండలంలోని జాకారం గ్రామంలో శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ స్థితిగతులను పరిశీలించారు. ఆలయ అభివృద్ధిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయాన్ని సందర్శనకు బోర్డులు, ఆలయ చరిత్ర వివరణాత్మక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు నాగరాజు, సాయి కిరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.