అక్రమ కేసులు సరికాదు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులు సరికాదు

Oct 16 2025 6:14 AM | Updated on Oct 16 2025 6:14 AM

అక్రమ కేసులు సరికాదు

అక్రమ కేసులు సరికాదు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం

ములుగు రూరల్‌: ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన పోరాడినందుకు బీజేపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేయ డం సరికాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కోర్టుకు 22మంది బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సీతక్క చొరవతో కాంగ్రెస్‌ నాయకులు ఫిర్యాదులతో పోలీసులు బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అణిచివేత దోరణికి భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, కొత్త సురేందర్‌, రవీంద్రాచారి, జవహర్‌లాల్‌, నగరపు రమేష్‌, కృష్ణాకర్‌, రాకేష్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement