
జీపీ కార్మికుల వేతనాలు విడుదల చేయాలి
ములుగు రూరల్: గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సదయ్య అన్నారు. శుక్రవారం వేతనాలు ఇ వ్వాలని కోరుతూ కలెక్టర్ దివాకరకు వినతి ప్రతం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంచాయతీల్లో సుమారు ఆరు నెలల వేతనాలు రాక పంచాయతీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైన అధికారులు వేతనాలు చెల్లించాలని, లేదంటే ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నా యకుడు రమేశ్, తదితరులు ఉన్నారు.