
లడ్డూ @ రూ.1.16 లక్షలు
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని గణేశ్ చౌక్ వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా వినాయక లడ్డూ వేలం పాటను నిర్వహకులు నిర్వహించగా జిల్లా కేంద్రంలోని వారాహి రెస్టారెంట్ యజమాని బొమ్మగాని హైమవతి–జగదీశ్వర్ దంపతులు రూ.1.16లక్షలకు పాడి దక్కించుకున్నారు. ఈ మేరకు నిర్వహకులు వారికి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, బలరాం, కొత్త సురేందర్, ఇమ్మడి రాకేష్యాదవ్, ఎల్లావుల అశోక్, రాకేష్రెడ్డి, అజయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.