శ్యామాప్రసాద్‌ ముఖర్జీ సేవలు ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

శ్యామాప్రసాద్‌ ముఖర్జీ సేవలు ఆదర్శం

Jul 7 2025 6:38 AM | Updated on Jul 7 2025 6:38 AM

శ్యామాప్రసాద్‌ ముఖర్జీ సేవలు ఆదర్శం

శ్యామాప్రసాద్‌ ముఖర్జీ సేవలు ఆదర్శం

ఏటూరునాగారం: శ్యామాప్రసాద్‌ ముఖర్జీ దేశానికి అందించిన సేవలు ఆదర్శమని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వావిలాల జనార్దన్‌ తెలిపారు. మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శ్యామాప్రసాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలు వీధుల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జనార్దన్‌ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సహాయంతో ఆయన 1951లో భారతీయ జనసంఘ్‌ను స్థాపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నె సంపత్‌, ఈక మహాలక్ష్మీ, గాడిచర్ల రాజశేఖర్‌, పలక గంగా, పెయ్యల రాకేష్‌, ఎర్రల్ల ఎల్లయ్య, పడిదల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement