ములుగు రూరల్: వర్షాకాలంలో మూడు నెలలకు సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్యకళాశాలలో ఉన్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్ను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో వచ్చే వ్యాధుల చికిత్సకు సరిపడా మందులను సెంట్రల్ మెడిసిన్ స్టోర్లో ఉంచుకోవాలన్నారు. లేకపోతే ఇండేంట్ ద్వారా సమకూర్చుకోవాలని స్టోర్ ఫార్మసీ అధికారి శ్రీనివాస్కు సూచించారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు పంపిణీ చేయాలన్నారు. స్టోర్లోని అన్ని గదులను ఆయన పరిశీలించారు. స్టోర్లో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్, జిల్లా మెడిసిన్ స్టోర్ ఫార్మసీ అధికారి వినోదర్, ఫార్మసీ అధికారి హిమ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ గోపాల్రావు