
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
ములుగు రూరల్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేఖ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భవన నిర్మాణ కార్మికులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలతో పని చేయించడం నేరం అన్నారు. పిల్లలతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.
చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్
మహేందర్