పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Jun 13 2025 4:55 AM | Updated on Jun 13 2025 4:55 AM

పేదలం

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ఏటూరునాగారం: రాష్ట్రంలో ఉన్న అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను మంత్రి సీతక్క గురువారం పంపిణీ చేశారు. ముందుగా ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకు 3500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ఇవ్వగా, ఇది ఏజెన్సీ ప్రాంతమని సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌కు వివరిస్తే ఐటీడీఏ ద్వారా మరో 1500ఇళ్లు మంజూరు చేశారని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క వెయ్యి ఇళ్లు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి దరఖాస్తు పత్రాల ను మంత్రి స్వీకరించారు. ఏటూరునాగారం మండలంలోని బూటారం గ్రామం జంపన్నవాగు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, వెంటనే దానిని మరో చోటుకు తరలించి ఇళ్ల స్థలం, ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని బాధితులు మొరపెట్టుకున్నారు.

రూ. 7 కోట్లతో బస్‌డిపో

ఏజెన్సీ ప్రజల కల సాకారం అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఏటూరునాగారం బస్‌ డిపోకు రూ. 7 కోట్లు మంజూరు అయ్యాయని, పనులు వేగంగా నాణ్యతగా చేసి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని మంత్రి కాంట్రాక్టర్‌, ఆర్టీసీ అధికారులను కోరారు. ఏటూరునాగారంలో బస్‌డిపోకు మంత్రి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ పనులు వేగంగా పూర్తి చేయాలని చూడాలని ఆర్‌ఎం విజయభానును కోరారు. అలాగే గట్టమ్మ వద్ద కోటి రూపాయలతో అదనపు బస్టాండ్‌, ములుగులో రూ.5కోట్లతో బస్టాండ్‌ నిర్మాణం పనులు చేపట్టినట్లు వివరించారు. అదే విధంగా ఏటూరునాగారంలో ఒక కోటి రూపాయలతో కూరగాయల మార్కెట్‌ నిర్మిస్తామన్నారు. అనంతరం గిరిజన భవన్‌లో అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని మంత్రి చేపట్టారు. అలాగే జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏకరూప దుస్తులను, పుస్తకాలు, నోట్‌బుక్స్‌లను మంత్రి సీతక్క విద్యార్థులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా బీఈడీ కాలేజీని మంజూరు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్‌ రేణుక మంత్రి సీతక్కకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కొమురం భీమ్‌ స్టేడియంలో నిర్వహించనున్న యోగా శిక్షణ కార్యక్రమం కరపత్రాలను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం భానుకిరణ్‌, చీఫ్‌ ఇంజనీర్‌ భాస్కర్‌, డీఎం హరిప్రియ, రవీంద్రనాథ్‌ సింగ్‌, సిబ్బంది చల్లా శ్రీనివాస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షుడు చిటమట రఘు, దేవేందర్‌, ఎల్లయ్య పాల్గొన్నారు.

మహనీయుడు అంబేడ్కర్‌

ఎస్‌ఎస్‌తాడ్వాయి: అన్ని వర్గాల ప్రజలకు సమానత్వ హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ అని మంత్రి సీతక్క తెలిపారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ రియాజ్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేశారు. అలాగే కొమురంభీం విగ్రహానికి కూడా పూలమాల వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీతక్క మాట్లాడుతూ అంబేడ్కర్‌ దేశంలోని ప్రజలందరికీ సమానమైన హక్కులు కల్పించాడని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే తాను ఈ స్థానంలో ఉన్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆశోక్‌, మండల అధ్యక్షుడు దేవేందర్‌, మేడారం జాతర కమిటీ మాజీ చైర్మన్‌ లచ్చుపటేల్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు కల్యాణి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌, తాడ్వాయి మాజీ సర్పంచ్‌ ఇర్ప సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ

మంత్రి సీతక్క

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు 1
1/2

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు 2
2/2

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement