జియోటెక్స్‌టైల్‌ క్లాత్‌ ఆపేనా! | - | Sakshi
Sakshi News home page
breaking news

జియోటెక్స్‌టైల్‌ క్లాత్‌ ఆపేనా!

Jun 9 2025 7:47 AM | Updated on Jun 9 2025 7:47 AM

జియోటెక్స్‌టైల్‌ క్లాత్‌ ఆపేనా!

జియోటెక్స్‌టైల్‌ క్లాత్‌ ఆపేనా!

గోదావరి కరకట్ట కోతకు గురికాకుండా తాత్కాలిక మరమ్మతులు

ఏటూరునాగారం: గోదావరి కరకట్ట కోతకు గురికాకుండా జియోటెక్స్‌టైల్‌క్లాత్‌తో చేస్తున్న మరమ్మతులు ఆపేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏటూరునాగారం మండలంలోని గోదా వరి కరకట్టకు తాత్కాలిక మరమ్మతులు కొనసాగుతున్నాయి. నాలుగేళ్లక్రితం వచ్చిన గోదావరి వరదకు కరకట్ట రామన్నగూడెం పుష్కరఘాట్‌కు 4.4 కిలోమీటర్ల పాయింట్‌ వద్ద ఒడ్డు కోతకు గురైంది. దీంతో అక్కడ ప్రమాదకరంగా మారింది. అయితే ప్రతీ ఏడాది కరకట్టకు ఇసుక బస్తాలను వేస్తూ ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ఇసుక బస్తాలతో పాటు నూతన సాంకేతికంగా జియోటెక్స్‌టైల్‌ (క్లాత్‌)ను ఇసుక బస్తాలపై నుంచి కప్పుతున్నారు. వరద ఎంత వచ్చినా ఈ ఇసుక బస్తాలు కొట్టుకుపోకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఇది పూర్తిగా కరకట్టను సంరక్షించే పద్ధతులు కావని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ప్రస్తుతం ఈ వర్షాకాలంలో వరద మరింత పెరిగితే గోదావరి కరకట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్‌ అధికారులు ఇసుక బస్తాలను కరకట్టకు అడ్డుగా వేశారు. అస్సాం గుత్తేదారులతో ఇసుక బస్తాలు వేయించిన చోట జియోటెక్స్‌టైల్‌క్లాత్‌ను ఇసుక బస్తాలపై అమర్చే పనులు చేపట్టారు. ఈ వర్షాకాలంలో వచ్చే వరదలకు ఇసుక బస్తాలు కొట్టుకపోకుండా ఈ జియోటెక్స్‌టైల్‌ క్లాత్‌ కాపాడుతుందని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. కానీ ఈ వర్షాకాలం పూర్తి అయ్యే వరకు మాత్రం ఏటూరునాగారం, రొయ్యూర్‌, శంకరాజుపల్లి, రామన్నగూడెం తదితర ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆలస్యం అవుతున్న

జియోట్యూబ్స్‌ నిర్మాణ పనులు

కొనసాగుతున్న ఇసుక బస్తాలపై

క్లాత్‌ ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement