
తెగిన మట్టి రోడ్డు.. నిలిచిన రవాణా
ఏటూరునాగారం: కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలోని కొండాయి హైలెవ్ బ్రిడ్జి వద్ద తాత్కాలి కంగా వేసిన మట్టి రోడ్డు మంగళవారం కురిసిన భా రీ వర్షానికి తెగిపోయింది. దీంతో గిరిజన గ్రా మాలైన కొండాయి, మల్యాల, కొత్తూరు, గోవిందరాజు ల కాలనీ, ఐలాపురం గ్రామాలకు రవాణా ని లిచి పోయింది. ఆయా గ్రామాలకు చేరుకోవాలంటే జంపన్నవాగులో ఈతపడి రావాలి. లేదంటే 40 కి లోమీటర్లు ఊరట్టం, మేడారం, తాడ్వాయి మీదుగా ఏటూరునాగారం చేరుకోవాల్సి ఉంటుంది.
రబ్బర్ బోటు ఏర్పాటు
ఈ విషయం తెలుసుకున్న అధికారులు మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు ఫైర్ స్టేషన్కు సంబంధించిన రబ్బర్ బోటును జంపన్న వాగు వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మండల ప్రత్యేకాధికారి రాంపతి, ఎంపీడీఓ రాజ్యలక్ష్మీ, ఎంపీఓ కుమార్, పంచాయతీ కార్యదర్శి సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘు రబ్బర్ బోటును పరిశీలించారు. ప్రజలను గ్రామాల్లో నుంచి అవసరాల నిమిత్తం వాగు దాటించే విధంగా బోటు సిబ్బందికి సూచనలు చేశారు. విద్యార్థులు, రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా కొండాయి వద్ద మట్టి రోడ్డు తెగిపోయిందని, ఎవరు కూడా వాగులో దిగరాదని హెచ్చరిక బోర్డును గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ ఏర్పాటు చేశారు.
కొండాయి నుంచి గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్
జంపన్నవాగు దాటేందుకు
తాత్కాలికంగా రబ్బర్ బోటు
హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన
అధికారులు

తెగిన మట్టి రోడ్డు.. నిలిచిన రవాణా

తెగిన మట్టి రోడ్డు.. నిలిచిన రవాణా