అవతరణ వేడుకల ముఖ్యఅతిథిగా సీతక్క | - | Sakshi
Sakshi News home page

అవతరణ వేడుకల ముఖ్యఅతిథిగా సీతక్క

May 31 2025 1:04 AM | Updated on May 31 2025 1:55 PM

ములుగు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జిల్లాలో నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా పాల్గొనే ప్రజా ప్రతినిధుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని తంగేడు స్టేడియంలో జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ ముఖ్యఅతిథిగా మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్క జెండా ఆవిష్కారణ చేయనున్నా రు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం తరఫున తంగేడు స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ

ములుగు: ములుగు మున్సిపాలిటీ తొలి కమిషనర్‌గా సంపత్‌ శుక్రవారం విధుల్లో చేరారు. ఇంతకుమందు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన సంపత్‌ మున్సిపాలిటీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. కాగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్‌ దివాకర టీఎస్‌ను తన చాంబర్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ములుగు: జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చీమలపాటి మహేందర్‌జీ సూచించారు. ఈ మేరకు శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 74 మంది సప్లిమెంటరీకి హాజరుకానున్నట్లు తెలిపారు. 

పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి ఇవ్వకూడదన్నారు. పోలీస్‌ శాఖ తరఫున 144 సెక్షన్‌ విధించాలని, కేంద్రాల చుట్టూ జిరాక్స్‌ సెంటర్లను మూసిఉంచాలన్నారు. వైద్యశాఖ తరఫున ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలతో వైద్య శబిరం నిర్వహించాలని సూచించారు. తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో డీఈఓ పాణిని, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, ఆర్టీసీ డిపో మేనేజర్‌ జ్యోత్స్న, ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణాధికారి అప్పని జయదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి క్వార్టర్స్‌లో చోరీ

గణపురం: మండలంలోని చెల్పూర్‌ శివారులోని సింగరేణి థౌసండ్స్‌ క్వార్టర్స్‌లో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి క్వార్టర్స్‌లో 12, 17, 21, 31 బ్లాక్‌లలో మించాల మధు, తిరుపతి, నరేష్‌, పవన్‌, శ్రీకాంత్‌, వినోద్‌ ఇళ్లలో చోరీ జరిగినట్లు తెలిపారు.

అవతరణ వేడుకల ముఖ్యఅతిథిగా సీతక్క1
1/1

అవతరణ వేడుకల ముఖ్యఅతిథిగా సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement