సకాలంలో రుణాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో రుణాలు అందించాలి

May 31 2025 1:04 AM | Updated on May 31 2025 1:04 AM

సకాలంలో రుణాలు అందించాలి

సకాలంలో రుణాలు అందించాలి

ములుగు: పంటల సాగు ప్రారంభంకానున్న నేపథ్యంలో రైతులకు పంట రుణాలు సకాలంలో అందించాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పేద, మధ్యతరగతి కుటుంబాలు వ్యవసాయం, తదితర రంగాలపై ఆధారపడి ఆదాయం సమకూర్చుకుంటారని, అలాంటి వారికి రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పంట రుణాలతో పాటు రాజీవ్‌ యువ వికాసం పథకం అమలులో బ్యాంకుల సహకారం ఎంతో అవసరమన్నారు. రాజీవ్‌ యువ వికాసానికి సంబంధించి బ్యాంకర్ల ద్వారా దరఖాస్తు వెరిఫికేషన్‌ పూర్తయిన వెంటనే ఎంపికై న లబ్ధిదారులకు వెంటనే యూనిట్లు గ్రౌండింగ్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలోని రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులకు కాస్మోటిక్‌ చార్జీలు నేరుగా విద్యార్థుల ఖాతాలో జమ చేయడానికి బ్యాంక్‌ శాఖలు విద్యార్థులకు బ్యాంక్‌ ఖాతాలు తెరవాలని, డెబిట్‌ కార్డులు జారీ చేయాలన్నారు.

కలెక్టర్‌ దివాకర టీఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement