పైన టమాట పెట్టెలు..లోపల పశువులు | - | Sakshi
Sakshi News home page

పైన టమాట పెట్టెలు..లోపల పశువులు

May 31 2025 1:04 AM | Updated on May 31 2025 1:04 AM

పైన టమాట పెట్టెలు..లోపల పశువులు

పైన టమాట పెట్టెలు..లోపల పశువులు

ఏటూరునాగారం: పైన ఖాళీ టమాట పెట్టెలు పెట్టుకొని పుష్ప సినిమాను తలదన్నె విధంగా అక్రమార్కులు మూగజీవాలను తరలిస్తూ పోలీసులకు శుక్రవారం పట్టుబడ్డారు. ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పశువులను పరిశీలించి రవాణాదారులను చట్టపరంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతానికి చెందిన అక్రమార్కులు 17 మూగజీవాలను డీసీఎం వ్యాన్‌లో ఊపిరాడకుండా దాచిపెట్టి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. శుక్రవారం పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు తనిఖీ చేసి పట్టుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తి పశువులు బయటకు కనిపించకుండా టమాట పెట్టెలతో అమర్చడంతో పశువులకు శ్వాస ఆడకుండా పోయిందని పశువైద్యాధికారి పవన్‌ పోలీసులకు తెలిపారు. దీంతో వెంటనే భూపాలపల్లి జిల్లా రాంపూర్‌ గోశాలకు ఆవులు, ఎద్దులను తరలించాలని ఏఎస్పీ ఆదేశించడంతో సీఐ శ్రీనివాస్‌, ఎస్సై తాజొద్దీన్‌, ట్రైనీ ఎస్సై రచిత్రలు డీసీఎంలో పశువులను గోశాలకు తరలించారు. డ్రైవర్‌ పెరుమాండ్ల లక్ష్మణ్‌, డీసీఎం యజమాని రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు 256 పశువులను పట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది వీరబాబు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

చెక్‌పోస్టు తనిఖీ

ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి ఇసుక అక్రమ రవాణా నివారణ కోసం రెవెన్యూ, పోలీసుశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును శుక్రవారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తనిఖీ చేశారు. ఇసుక లారీల్లో కెపాసిటీ తగ్గట్టు రవాణా జరుగుతుందా లేదా అని ఆరా తీశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే లారీ యజమానులపై కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌, ఎస్సై తాజొద్దీన్‌ ఉన్నారు.

పట్టుకున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement