
సమన్వయంతో పుష్కరాలు విజయవంతం
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం అయ్యాయని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. సరస్వతీ పుష్కరాలు విజయవంతంపై బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ కిరణ్ఖరేతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలకు 30 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారని, ఏర్పాట్లపై నిరంతరం ప్రభుత్వ మార్గదర్శనం మేరకు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశామన్నారు. సరస్వతీ మాతా విగ్రహం ఏర్పాటు చేసి, ప్రతీ రోజు కాశీపండితులచే నవరత్న మాల హారతి నిర్వహించామన్నారు. టెంట్ సిటీ ఏర్పాటు ద్వారా 40 రూములు, 200 డార్మెటరీ, ఫుడ్ కోర్టు, కిడ్స్ ప్లే జోన్, వాహన పార్కింగ్ ఏర్పాట్లతో సౌకర్యాలు కల్పించామన్నారు. వర్షంతో అవాంతరాలు వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేశామన్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు మజ్జిగ, మంచినీరు సరఫరా చేయడంతో పాటు క్యూలో ఉన్న భక్తుల సౌకర్యార్థం కూలర్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాల నిర్వహణ సంతృప్తిని ఇచ్చినట్లు తెలిపారు.
ఇదొక మంచి అనుభవం..
సరస్వతీ నది పుష్కరాలు మంచి అనుభవంగా ఉపయోగపడుతుందని ఎస్పీ కిరణ్ఖరే తెలిపారు. కాళేశ్వరానికి లక్షల్లో భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
కలెక్టర్ రాహుల్శర్మ