
జూన్ 2న యువ వికాసం ప్రొసీడింగ్స్
ములుగు: రాజీవ్ యువవికాసం లబ్ధిదారులకు జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ఈ మేరకు హైదరాబాద్లోని సచివాలయం నుంచి రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ప్రభుత్వం కార్పోరేషన్ ద్వారా మొక్కుబడిగా పథకాలను అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే చిత్తశుద్ధితో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుందన్నారు. 29, 30వ తేదీలలో ఇన్చార్జ్ మంత్రులు తుది జాబితాను ఆమోదించాలని తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యువ వికాసం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా తరఫున కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారి రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
వీసీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క