
పేదలకు భూమి పట్టాలు అందించాలి
ములుగు రూరల్: కాస్తులో ఉన్న పేద రైతులకు భూమి పట్టాలు అందించాలని తెలంగాణ రైతు సంఘం నాయకుడు తుమ్మల వెంకట్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం అదనపు కలెక్టర్ మహేందర్జీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం మండలం జవహర్నగర్ శివారులో ప్రభుత్వం ఒక కుటుంబానికి 26.34ఎకరాల భూమిని 1995లో పట్టా చేసింది కానీ పట్టాదారులకు భూమి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. సర్వే నంబర్ 1873లో నాలుగు ఎకరాల పట్టా భూమిని పట్టుకొని హైకోర్టును ఆశ్రయించి మిగతా భూమిని కాజేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులచే సర్వే నిర్వహించి పేద రైతులకు పట్టాలు అందించాలని కోరారు. అక్రమ అసైన్డ్ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగవెల్లి సత్యనారాయణ, రవీందర్, సదాశివరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతుసంఘం నాయకుడు
వెంకట్రెడ్డి