కేసుల దర్యాప్తుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కేసుల దర్యాప్తుల్లో వేగం పెంచాలి

May 28 2025 5:41 PM | Updated on May 28 2025 5:41 PM

కేసుల దర్యాప్తుల్లో వేగం పెంచాలి

కేసుల దర్యాప్తుల్లో వేగం పెంచాలి

ములుగు: పోలీస్‌స్టేషన్ల వారీగా నమోదైన కేసుల పరిష్కారానికి చేపట్టే దర్యాప్తులో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ డాక్టర్‌ శబరీశ్‌ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ఎస్పీ హాజరై మాట్లాడారు. ప్రతీకేసును ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలన్నారు. దొంగతనాలు, ఆర్థిక నేరాల్లో ఫిర్యాదు దారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పోగొట్టుకున్న నగదు, ఇతర విలువైన వస్తువులు బాధితులకు అందేలా కృషి చేయాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఇన్‌చార్జి ఓఎస్డీ, ములుగు డీఎస్పీ నలువాల రవీందర్‌, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్‌, సీఐలు శ్రీనివాస్‌, కుమార్‌, రవీందర్‌, ఎస్సైలు వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ డాక్టర్‌ శబరీశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement