10 మండలాలు.. 5,151 మెట్రిక్‌ టన్నుల బియ్యం | - | Sakshi
Sakshi News home page

10 మండలాలు.. 5,151 మెట్రిక్‌ టన్నుల బియ్యం

May 28 2025 5:41 PM | Updated on May 28 2025 5:41 PM

10 మం

10 మండలాలు.. 5,151 మెట్రిక్‌ టన్నుల బియ్యం

జిల్లాలోని 10 మండలాల పరిధిలో 222 రేషన్‌ షాపులు ఉన్నాయి. ఆయా మండలాల్లో 94,628 రేషన్‌ కార్డుదారులు ఉండగా 2,76,349 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికి జూన్‌, జూలై, ఆగస్టు కోటా సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు 5,151 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం ఉంది. ఈ నెల 30లోగా రేషన్‌ షాపులకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉండగా కొన్ని రేషన్‌ షాపుల్లో బియ్యం నిల్వ చేయడానికి స్థలం లేకపోవడంతో అధికారులు జూన్‌ 7 వరకు బియ్యాన్ని ఆయా రేషన్‌ షాపులకు సరఫరా చేయనున్నారు. జూన్‌ 1 నుంచి రేషన్‌ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలని రేషన్‌ డీలర్లకు ఇప్పటికే అధి కారులు ఆదేశాలు జారీ చేశారు.

వెంకటాపురం(ఎం): రాబోయే వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పేద ప్రజలకు బియ్యం సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందస్తుగానే మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను జూన్‌ 1 నుంచి 30 వరకు పేదలకు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎంఎల్‌ఎస్‌ (మండల లెవల్‌ స్టాక్‌) పాయింట్ల నుంచి రేషన్‌ దుకాణాలకు బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. దీంతో జిల్లా ప్రజలకు ముందస్తుగానే రేషన్‌ షాపుల ద్వారా సన్నబియ్యం అందనున్నాయి. భారీ వర్షాలు కురిస్తే వాగులు పొంగి రవాణా స్తంభించే ఏజెన్సీ గ్రామాలకు ముందస్తుగానే బియ్యం అందనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జీసీసీ సేల్స్‌మెన్లతో సమావేశం

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని జీసీసీ కార్యాలయం వద్ద మంగపేట, ఏటూరునాగారం, వెంకటాపురం(కె) మండలాల్లోని జీసీసీ సేల్స్‌మెన్లతో మంగళవారం బియ్యం పంపిణీపై జీసీసీ డీఎం కుంజ వాణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్‌లో మూడు నెలల సన్నబియ్యాన్ని రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేయాలన్నారు. రాబోయే వర్షాకాలంలో సన్నబియ్యం కోసం ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. జూన్‌ 1 నుంచి 30వ తేదీ వరకు బియ్యాన్ని ఇవ్వాలన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. ముందస్తుగా లబ్ధిదారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమయపాలన పాటిస్తూ రేషన్‌ బియ్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్‌ఓ సయ్యద్‌ షా ఫైజల్‌ హుస్సేన్‌, వెంకటాపురం(కె) జీపీసీఎంఎస్‌ మేనేజర్‌ స్వామి, డీటీ రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్ని ఏర్పాట్లు చేశాం

రేషన్‌ కార్డుదారులకు ఒకే సారి మూడు మాసాలకు సంబంధించిన బియ్యం కోటాను అందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ షాపులకు బియ్యం రవాణా చేస్తున్నాం. జూన్‌ 1 నుంచి రేషన్‌ షాపుల్లో బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది. ఏ ఒక్క కార్డుదారుడు ఇబ్బంది పడకుండా డీలర్లు బియ్యం పంపిణీ చేస్తారు. లబ్ధిదారులు మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యం కోసం మూడుసార్లు వేలిముద్రలు వేసి బియ్యం తీసుకోవాలి.

– షా ఫైజల్‌ హుస్సేన్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి

జూన్‌ 1 నుంచి 30 వరకు పంపిణీ

వర్షాలు, వరదల నేపథ్యంలో

ప్రభుత్వం నిర్ణయం

ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ దుకాణాలకు చేరుతున్న బియ్యం

జిల్లా వ్యాప్తంగా

94,628 రేషన్‌ కార్డులు

10 మండలాలు.. 5,151 మెట్రిక్‌ టన్నుల బియ్యం
1
1/3

10 మండలాలు.. 5,151 మెట్రిక్‌ టన్నుల బియ్యం

10 మండలాలు.. 5,151 మెట్రిక్‌ టన్నుల బియ్యం
2
2/3

10 మండలాలు.. 5,151 మెట్రిక్‌ టన్నుల బియ్యం

10 మండలాలు.. 5,151 మెట్రిక్‌ టన్నుల బియ్యం
3
3/3

10 మండలాలు.. 5,151 మెట్రిక్‌ టన్నుల బియ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement