అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రం పరిశీలన

May 9 2025 1:05 AM | Updated on May 9 2025 4:45 PM

వాజేడు: మండల పరిధిలో చెరుకూరు అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రాన్ని గురువారం ములుగు డీసీఎస్‌ఓ ఫైజ్‌ హుస్సేన్‌, సివిల్‌ సప్లయీస్‌ డీటీ రామచందర్‌లతో కలిసి విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రి కార్డులను చూసిన వారు పలు సూచనలు చే శా రు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి లోడ్‌తో వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ధ్రు వీకరణ పత్రాలను తప్పని సరిగా పరిశీలించాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

నాన్‌ మైనార్టీ విద్యార్థినుల ఎంపిక పూర్తి

ములుగు రూరల్‌: ములుగు మండల పరిధిలోని దేవగిరిపట్నం మైనార్టీ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశాలకు నాన్‌ మైనార్టీ విద్యార్థినులను లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీలత తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా మైనార్టీ శాఖ అధికారి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమక్షంలో డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ మైనారిటీ గురుకుల పాఠశాలలో 20 సీట్లకు గాను బీసీలకు 10, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, ఓసీలకు 2 సీట్లను డ్రా పద్ధతిన భర్తీ చేసినట్లు తెలిపారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనం, వసతి కల్పిస్తున్నామని వివరించారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రూ. 20 లక్షల వైద్య పరికరాల అందజేత

ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఎముకల విభాగానికి గురువారం ఈసీఐఎల్‌ హైదరాబాద్‌ సంస్థ ఆధ్వర్యంలో రూ.20లక్షల విలువ చేసే ఆపరేషన్‌ సీఆర్మ్‌ మెషిన్‌, ఓట్‌లైట్‌ ప్రాచ్చర్‌ టేబుల్‌ పరికరాలను కలెక్టర్‌ దివాకర చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఈసీఐఎల్‌ హైదరాబాద్‌ సంస్థ చేసిన సేవలను ఆయన అభినందించారు. భవిష్యత్‌లో ఆస్పత్రికి ఉపయోగ పడేలా మంచి పనులు చేయటానికి ముందుకు రావాలని సంస్థ ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జగదీశ్‌, ఈసీఐఎల్‌ ప్రతినిధులు సి.మురళిధర్‌, ఈడీ సుదర్శన్‌ కుమార్‌, ఎడ్‌(పైనాన్స్‌) రంజన్‌ శ్రీవాస్తవ, ఏజీఎం (ఫైనాన్స్‌) పి.వేణుబాబు, సీఎంఓ, ఎస్‌డీజీఎం ఎ.రామకృష్ణ, ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ఎ.సాంబమూర్తి, కార్పొరేట్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ పోచం

ఏటూరునాగారం: గిరిజన విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ పోచం అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గోల్డ్‌మెడల్‌ సాధించిన లావణ్యను డీడీ పోచం గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా సూర్య తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో కొమురం లావణ్య మాస్టర్‌ పర్యవేక్షణలో శిక్షణ పొందిందని తెలిపారు. మార్చిలో నిర్వహించిన ఇండియా, నేపాల్‌ అంతర్జాతీయ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో 49 కిలోల కేటగిరిలో స్వారింగ్‌లో పాల్గొని గోల్డ్‌మెడల్‌ సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించినట్లు పేర్కొన్నారు. విద్యార్థినులు స్వీయ రక్షణకు కరాటే నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ క్షేత్రయ్య, పీసా కోఆర్డినేటర్‌ కొమురం ప్రభాకర్‌ పాల్గొన్నారు.

అంతర్రాష్ట్ర ధాన్యం  తనిఖీ కేంద్రం పరిశీలన 1
1/1

అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రం పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement