
‘పాకిస్తానీయులను పంపించాలి ’
ములుగు రూరల్: జిల్లా వ్యాప్తంగా పాకిస్తాన్కు చెందిన వారు స్థానికంటే ఉంటే వారిని వెంటనే గుర్తించి తిరిగి వారి దేశం పంపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పాకిస్తాన్ మద్దతుతో ఆశ్రయం పొందిన ఉగ్రవాదులు పహల్గాం దాడిలో 26మంది అమాయక పౌరులను బలిగొన్నారని తెలిపారు. ఉగ్రవాదులను ప్రోత్సహించే శక్తులపై ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు భూక్య జవహర్, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, దొంతిరెడ్డి రవిరెడ్డి, నాగరాజు, కుమార్, వెంకన్న, శ్రీహరి, పాపిరెడ్డి పాల్గొన్నారు.