అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

Apr 12 2025 2:12 AM | Updated on Apr 12 2025 2:12 AM

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

ఏటూరునాగారం : అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ డివిజినల్‌ అధికారి సత్తయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ఫైర్‌ ఆక్సిడెంట్‌ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్‌డ్రిల్‌ నిర్వహించి, అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగినప్పుడు కంగారు పడకుండా విద్యుత్‌ సరఫరా నిలిపి వేసి ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. మంటలకు మరింత తోడునందించే పదార్థాలు ఏమైనా ఉంటే వెంటనే వాటిని దూరంగా పడేయాలని అన్నారు. విద్యుత్‌ సరఫరా సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే కర్ర సాయంతో తొలగించాలన్నారు. కరెంట్‌ సరఫరా ఉన్న వస్తువులపై వెంటనే నీరు పోయొద్దని తెలిపారు. అగ్నిప్రమాదం జరిగితే 101, 87126 85772 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి శుక్రవారం జన సమూహాలు ఉన్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సత్తయ్య వివరించారు.ఈ కార్యక్రమంలో లీడ్‌ ఫైరింగ్‌ ఆస్పత్రి రవికుమార్‌ పాల్గొన్నారు.

డివిజినల్‌ అధికారి సత్తయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement