
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ములుగు రూరల్ : అమ్మకాలకు తీసుకువచ్చే ధాన్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్కుమార్ రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అబ్బాపూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ధాన్యం విక్రయించి సన్న ధాన్యానికి ప్రభుత్వం అందిస్తున్న రూ. 500 బోనస్ పొందాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం గోవింద్చౌహాన్, ఏపీఎం జవహార్, జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె జయపాల్రెడ్డి, అసోసియేషన్ కోశాధికారి మోహన్, సెంటర్ నిర్వాహకులు సరిత, స్రవంతి, అక్షయ, పద్మ, రైతులు పాల్గొన్నారు.