సామాజిక వేత్త జ్యోతిబాపూలే | - | Sakshi
Sakshi News home page

సామాజిక వేత్త జ్యోతిబాపూలే

Apr 12 2025 2:12 AM | Updated on Apr 12 2025 2:12 AM

సామాజ

సామాజిక వేత్త జ్యోతిబాపూలే

ములుగు : సామాజిక వేత్త మహాత్మా జ్యోతిబాపూలే అని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) సంపత్‌ రావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్‌లో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంపత్‌ రావు ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని ఏర్పాటు చేసిన మహానీయుడని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌ రెడ్డి, జేఏసీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్డెపల్లి సారంగపాణి, సీపీఐ జిల్లా అధ్యక్షుడు జంపాల రవీందర్‌, సేవాలాల్‌ సేన రాష్ట్ర అ ధ్యక్షుడు పోరిక రాహుల్‌, భద్రయ్య, సంజీవయ్య, స్వామి, బుచ్చన్న, పైడి, రవి పాల్గొన్నారు.

విశ్రాంత ఉద్యోగుల భవనంలో..

జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సామాజిక న్యాయ వేదిక జిల్లా కార్యదర్శి బాదావత్‌ బాలాజీ నాయక్‌ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పోరిక శ్యామల్‌ నాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి పోరే రవియాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కొమురయ్య, డప్పు కళాకారుడు దూడపాక రాజేందర్‌, రత్నం రాజేందర్‌, మేకల సాంబయ్య, రాజయ్య ఉన్నారు.

అదనపు కలెక్టర్‌ సంపత్‌ రావు

సామాజిక వేత్త జ్యోతిబాపూలే1
1/1

సామాజిక వేత్త జ్యోతిబాపూలే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement