
‘పలాస 1978’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన హీరో రక్షిత్ అట్లూరి నటిస్తున్న తాజా చిత్రం 'శశివదనే'... ఇందులో కోమలీ ప్రసాద్ హీరోయిన్గా నటిస్తుంది. రీసెంట్గా హిట్-3 సినిమాతో ఆమె మరింత గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 'శశివదనే' చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో ఆర్ఎక్స్ 100 రాంకీ, నటుడు రఘు కుంచె, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్ నటీనటులుగా సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అహితేజ బెల్లంకొండ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇది గోదావరి నేపథ్యంలో సాగే ఫీల్గుడ్ వింటేజ్ విలేజ్ లవ్స్టోరీ. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది.