అఫ్గానిస్తాన్లో ఏం జరుగుతోంది? అలనాటి హీరోయిన్ ఆందోళన
Published
Tue, Aug 17 2021 9:19 PM
ప్రస్తుతం ఎక్కడ విన్నా అఫ్గానిస్తాన్కు సంబంధించిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలతో అంతా అఫ్గాన్ ప్రజల గురించి ఆవేదన చెందుతూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గన్ పరిణామాలు ప్రపంచాన్ని ఆవేదనకు గురి చేస్తోంది. తాజాగా ఈ పరిణామాలపై ప్రముఖ నటి, ఎంపీ హేమ మాలిని స్పందించారు. ‘అసలు అఫ్గనిస్తాన్లో ఏం జరుగుతోంది’? అని ఆందోళన చెందుతూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన సినిమాల షూటింగ్ అఫ్గానిస్తాన్లో జరిగిన రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు.
‘ఒకప్పుడు ఎంతో సంతోషంగా.. శాంతియుతంగా ఉన్న అఫ్గానిస్తాన్లో అసలేం జరుగుతోంది? ఇది నిజంగా చాలా బాధకరమైన విషయం. ‘ధర్మాత్మ’ సినిమా షూటింగ్ సమయంలో అఫ్గన్లో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాలో నా పాత్ర మొత్తం ఆ దేశంలోనే షూటింగ్ పూర్తయ్యింది. ఆ సమయంలో నా కుటుంబసభ్యులు అక్కడే ఉన్నారు. సహ నటుడు ఫిరోజ్ ఖాన్ నా సంరక్షణ చూసుకున్నారు.’ అని హేమమాలిని ట్వీట్ చేశారు. అయితే ‘ధర్మాత్మ’ అఫ్గానిస్తాన్లో షూటింగ్ చేసుకున్న తొలి బాలీవుడ్ సినిమాగా నిలవడం విశేషం.
What is happening to a happy, once peaceful nation, Afghanistan, is truly sad. My great memories of Afghanistan date back to ‘Dharmatma’- I play a gypsy girl & my portion was shot entirely there. Had a great time as my parents were with me and Feroz Khan took good care of us pic.twitter.com/2jrsZJpvQd