భరణితో ట్రోల్స్‌.. ఫైర్‌ అయిన మాధురి | Divvela Madhuri Reaction With Bharani Memes In Bigg Boss 9 Telugu | Sakshi
Sakshi News home page

భరణితో ట్రోల్స్‌.. ఫైర్‌ అయిన మాధురి

Nov 4 2025 11:22 AM | Updated on Nov 4 2025 11:38 AM

Divvela Madhuri Reaction With Bharani Memes In Bigg Boss 9 Telugu

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 9 (Bigg Boss Telugu)లో మాధురి ( Madhuri) కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నారు. అయితే, హౌస్లో ఉన్నన్నిరోజులు తనదైన రీతిలో ముద్రవేశారు. వైల్డ్కార్డ్ఎంట్రీ ఇచ్చిన మాధురి 8 వారంలో ఎలిమినేట్అయ్యారు. క్రమంలో బిగ్బాస్షో గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఆపై భరణి, తనను కలిపి ట్రోల్చేస్తున్నవారిపై విరుచుకుపడ్డారు. భరణి రీఎంట్రీ వెనుకు దాగి ఉన్న అసలు కారణం ఏంటో మాధురి ఓపెన్గా చెప్పారు.

భరణితో మీమ్స్‌.. భగ్గుమన్న మాధురి
బిగ్బాస్లో మాధురి ఉన్నన్నిరోజులు తన గేమ్తో పాటు పదునైన మాటలతో ఫైర్అయ్యారు. అయితే, హౌస్లో ఉన్నది కొద్దిరోజులు మాత్రమే అయినప్పటికీ తనకు నచ్చినట్లు వ్యవహరించారు. ఎక్కడా కూడా బిగ్బాస్కు సరెండర్అయి గేమ్ఆడలేదనిపించేలా సత్తా చాటారు. అయితే.. ఆమె హౌస్లో ఉండగా కొందరు అదేపనిగా భరణి, మాధురి ఫోటోలతో ట్రోల్స్చేశారు. వాటిపై ఆమె ఇలా ఇరుచుకుపడ్డారు. 'సోషల్మీడియాలో కొందరు బుద్దిలేని ఎదవలు మాత్రమే ఇలాంటి మీమ్స్వేశారు

దీపావళి పండగ సందర్బంగా హోస్ట్నాగార్జున చెబితేనే భరణితో డ్యాన్స్చేయాల్సి వచ్చింది. అది కూడా చాలా దూరంగా ఉంటూనే రెండు స్టెప్పులు వేశాను. కనీసం అతని చేతులు కూడా నేను టచ్చేయలేదు. ఎలాంటి అశ్లీలత లేకుండా డ్యాన్స్చేస్తే నీచాతినీచంగా ఇలాంటి ట్రోల్స్చేస్తారా..? నాపై ఎవడైతే ట్రోల్స్చేశాడు వాడు మనిషి కాదు.. ఒక పశువుతో సమానం. మనిషి జన్మ ఎత్తినవాడు ఎవడూ కూడా ఇలాంటి నీచమైన ట్రోల్స్చేయడు.' అని ఆమె ఆవేదన చెందారు.

భరణి రీఎంట్రీ వెనుక నాగబాబు
బిగ్బాస్లో అత్యంత పేలవమైన కంటెస్టెంట్గా భరణి ఉన్నారు. హౌస్లో అందరితో బాగుండాలనే ఆలోచనతో ఎక్కువగా బాండింగ్స్పెట్టుకోవడం ప్రేక్షకులకు నచ్చేలేదు. తను సేఫ్‌గేమ్ఆడుతున్నాడని హౌస్ట్నాగార్జున కూడా చెప్పారు. దీంతో ఆయన 7 వారంలోనే ఎలిమినేట్అయ్యారు. అయితే, రీఎంట్రీ పేరుతో దమ్ము శ్రీజ, భరణిని హౌస్లోకి పంపారు. ప్రేక్షకుల ఓటింగ్ప్రకారం ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే హౌస్లో ఉంచుతామని బిగ్బాస్చెప్పారు. అయితే, దమ్ము శ్రీజ రీఎంట్రీ ఉంటుందని ప్రేక్షకులు ఎక్కువగా భావించారు

కానీ, ఫైనల్గా ఛాన్స్భరణికి దక్కింది. అంశంలో మాధురి కూడా ఇలా రియాక్ట్అయ్యారు. మెగా బ్రదర్నాగబాబు ఆశీస్సులు భరణికి ఉన్నాయని.., అందుకే నాగబాబుకు రెండో ఛాన్స్ఇచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే విషయంలో దమ్ము శ్రీజ కూడా రియాక్ట్అయింది. భరణి రీఎంట్రీ కోసం తనను బలి చేశారని ఆమె చెప్పింది. భరణి రీఎంట్రీపై చాలామంది ప్రేక్షకులు కూడా తమ అసంతృప్తి తెలిపారు.

భరణి కోసం ట్వీట్వేసిన నాగబాబు
బిగ్బాస్సీజన్ప్రారంభంలోనే భరణి కోసం నాగబాబు అండగా నిలిచారు. క్రమంలో ఆయన ఇలా ట్వీట్చేశారు. 'నాకు చాలా సన్నిహితుడైన నా ప్రియమైన భరణి శంకర్.. బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణం అతనికి నిజంగా విజయాన్ని, గుర్తింపును తీసుకురావాలి.' అంటూ నాగబాబు ట్వీట్చేశారు.

తనూజ విన్నర్అవుతుంది
బిగ్బాస్సీజన్‌ 9 విన్నర్తనూజ అవుతుందని మాధురి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తనకే ఎక్కువ ఛాన్స్ఉందన్నారు. అందరూ అనుకుంటున్నట్లు ఆమె సేఫ్గేమ్ఆడటం లేదని క్లారిటీ ఇచ్చారు. 'వాస్తవంగా ఎలిమినేషన్రౌండ్లో నన్ను సేవ్చేస్తానని తనూజ కోరింది. నేను వద్దని చెప్పాను. గౌరవ్కు గేమ్ఆడాలని ఆశ ఉంది కాబట్టి తనను సేవ్చేయమని తనూజను కోరాను. అంతేకాకుండా హౌస్లో ఉండటం నాకు ఇష్టం లేదు. నా భర్త పుట్టినరోజు ఉందని తనూజకు చెప్పాను. ఎట్టిపరిస్థితిల్లోనూ నన్ను సేవ్చేయవద్దని ఒట్టు కూడా తనూజతో వేయించుకున్నాను.' అని మాధురి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement