ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం
నర్సాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, వారి నమ్మకాన్ని వమ్ముచేయబోమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి చెప్పారు. నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా లక్ష్మి బాద్యతలు తీసుకున్న అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇతర హామీలు అమలు చేస్తుందని ప్రజలు తమ ప్రభుత్వం పట్ల నమ్మకంతో ఉన్నారని చెప్పారు. చైర్పర్సన్, కౌన్సిలరందరిని వారు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ నేతలు
ఆంజనేయులుగౌడ్, రాజిరెడ్డి


