నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్‌

Dec 17 2025 10:23 AM | Updated on Dec 17 2025 10:23 AM

నేడు

నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్‌

నర్సాపూర్‌: పోలింగ్‌ సిబ్బంది మంగళవారం ఎన్నికల సామగ్రి తీసుకొని తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లారు. సామగ్రి ప్రక్రియను జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎండీ జుల్ఫేకర్‌ అలీ, ఏఎస్పీ మహేందర్‌ పరిశీలించారు. ఎంపీడీఓ మధులత, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ సామగ్రి పంపిణీ చేపట్టగా ఆర్‌డీఓ మహిపాల్‌ పర్యవేక్షించారు. సీఐ జాన్‌రెడ్డి, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి ఎన్నికల అధికారులకు భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఉదయం 7గంటల నుంచి ప్రారంభం ● కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది 161 సర్పంచ్‌, 1,221 వార్డులకు ఎన్నికలు ● గట్టి బందోబస్తు: ఎస్పీ

మెదక్‌జోన్‌: ఆఖరి విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. మూడో విడతలో నర్సాపూర్‌ నియోజకవర్గంలోని నర్సాపూర్‌, చిలిప్‌చెడ్‌, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దూర్తి, మాసాయిపేట మండలాల పరిధిలో 183 గ్రామ పంచాయతీలు, 1,,528 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే 22 సర్పంచ్‌, 307 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 161 పంచాయతీలతో పాటు 1,221 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా 41 సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు.

సామగ్రితో తరలిన సిబ్బంది

నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్‌1
1/2

నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్‌

నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్‌2
2/2

నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement