నిజాయితీగా పనిచేయాలి: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

నిజాయితీగా పనిచేయాలి: కలెక్టర్‌

Oct 29 2025 8:33 AM | Updated on Oct 29 2025 8:33 AM

నిజాయితీగా పనిచేయాలి: కలెక్టర్‌

నిజాయితీగా పనిచేయాలి: కలెక్టర్‌

మెదక్‌ కలెక్టరేట్‌/కౌడిపల్లి(నర్సాపూర్‌): జిల్లాలో అవినీతికి తావులేకుండా పారదర్శక పాలనే లక్ష్యంగా ముందు సాగుతున్నామని, అధికారులు ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి నిజాయితీగా పనిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలలో భాగంగా మంగళవారం మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 27 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు జిల్లాలో ‘కల్చర్‌ ఆఫ్‌ ఇంటెగ్రిటీ ఫర్‌ నేషన్స్‌ ప్రాస్పర్టీ’అనే థీమ్‌తో విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు జరుగుతాయన్నారు. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశా ల మేరకు స్టేట్‌ విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనపై క్విజ్‌ పోటీలు, వాక్‌థాన్‌లు, మార థాన్‌ లు, వీధి నాటకాలు, గ్రామసభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విజిలెన్స్‌ పోస్టర్స్‌ను ఆవిష్కరించారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి

తుపాను ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కౌడిపల్లి మండలంలోని మహమ్మద్‌నగర్‌లోని పీఏసీఎస్‌ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్‌డీఓ మహిపాల్‌రెడ్డి, డీఎస్‌ఓ నిత్యానంద్‌, డీఎంసీఎస్‌ జగదీశ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... మొంథా తుపాను నేపథ్యంలో రైతులు వరికోతలు వాయిదా వేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement