రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు

Jun 28 2025 8:46 AM | Updated on Jun 28 2025 9:00 AM

రాష్ట

రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు

రామాయంపేట(మెదక్‌): శనివారం నుంచి నిజామాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనడానికి ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన 18 మంది క్రీడాకారులు శుక్రవారం తరలివెళ్లారు. మూడు రోజుల పాటు పోటీలు కొనసాగనున్నాయి. క్రీడాకారులకు బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పంజా విజయకుమార్‌ టీ షర్టులు అందజేశారు. వారి వెంట కోచ్‌ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

ఏడుపాయల హుండీ ఆదాయం రూ. 48.48 లక్షలు

పాపన్నపేట(మెదక్‌): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో హుండీలను శుక్రవారం లెక్కించగా రూ. 48,48,340 ఆదాయం వచ్చింది. ఆలయ ప్రత్యేక అధికా రిణి అంజలిదేవి, ఈఓ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది, వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు, గోకుల్‌షెడ్డులో కానుకలు లెక్కించారు. వెండి, బంగారం మినహా 60 రోజుల్లో భక్తుల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు.

పశువులకు టీకాలు

తప్పనిసరి

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు రాకుండా పశువులు, జీవాలకు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య సూచించారు. మండలంలోని ఫైజాబాద్‌లో శుక్రవారం పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధులు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్‌ ఏడీ జనార్దన్‌రావు, మండల పశువైద్యాధికారి వినోద్‌కుమార్‌, అల్లాదుర్గం మండల పశువైద్యాధికారి ఆంజనేయులు, సిబ్బంది, రైతు లు పాల్గొన్నారు.

ఫీజు బకాయిలు

వెంటనే చెల్లించండి

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో గత మూడేళ్లుగా బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద విద్యార్థులకు చెల్లించాల్సిన దాదాపు రూ. 1.70 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలల్లో బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద డే స్కాలర్‌, రెసిడెన్షియల్‌లో విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. వారి ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు మానసికంగా వేధిస్తున్నాయని వాపోయారు. కార్యక్రమంలో డీబీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి దయాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో

అంతరాయం

పెద్దశంకరంపేట(మెదక్‌): మండల పరిధిలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఇన్‌చార్జి ఏఈ యాసిన్‌ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్‌స్టేషన్‌ పరిధిలోని ఆయా గ్రామాల ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు   
1
1/3

రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు

రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు   
2
2/3

రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు

రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు   
3
3/3

రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement