
గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ నగేష్
నర్సాపూర్ రూరల్: ప్రభుత్వం విధించిన గడువులోగా రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేష్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో 37 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అసైన్డ్ భూములు, సాదా బైనామాలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చినట్లు వివరించారు. అనంతరం సిబ్బందితో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ సిద్ధిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.