
డొక్కలు చిక్కి.. బొక్కలు తేలి
దొంతి వేణుగోపాలస్వామి ఆలయం వద్ద గోశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటి సంరక్షణను పట్టించుకునే నాథులు కరువయ్యారు. గోశాలలో గ్రాసం లేకపోవడంతో కేవలం నీటితోనే ఆలమంద సరిపెట్టుకుంటుంది. ఆరు రోజులుగా గోవులను మేత కోసం బయటకు తీసుకువెళ్లకపోవడంతో బక్కచిక్కి బొక్కలు తేలాయి. దీనికి తోడు గోశాల పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దాతలు ముందుకు వచ్చి గ్రాసం అందించడంతో పాటు గోశాల పరిరక్షణకు కృషి చేయాలని పలువురు వేడుకుంటున్నారు. పశువైద్య సిబ్బంది గోవులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
– శివ్వంపేట(నర్సాపూర్)