సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం

Jun 28 2025 8:46 AM | Updated on Jun 28 2025 9:00 AM

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

మెదక్‌ మున్సిపాలిటీ: సైబర్‌ నేరాలు, మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో పోలీస్‌ అధికారులతో నెలవారీ క్రైం రివ్యూ నిర్వహించి, కేసుల గురించి ఆరా తీశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో సైబర్‌ మోసాల వల్ల జరిగే నష్టాలే అధికంగా ఉన్నాయన్నారు. యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా కళాబృందాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రేవ్‌ కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం చేయొద్దని సూచించారు. సీసీ కెమెరాల పనితీరు, ఏర్పాటులో సమాజం నుంచి సహకారం తీసుకోవాలన్నారు. రౌడీషీటర్లపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని అధికారులను ఆదేశించారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్‌, తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌గౌడ్‌, మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement