ప్రభుత్వ బడిలోనే బంగారు భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడిలోనే బంగారు భవిష్యత్‌

Jun 12 2025 11:02 AM | Updated on Jun 12 2025 11:02 AM

ప్రభుత్వ బడిలోనే బంగారు భవిష్యత్‌

ప్రభుత్వ బడిలోనే బంగారు భవిష్యత్‌

మెదక్‌మున్సిపాలిటీ/హవేళిఘణాపూర్‌/నర్సాపూర్‌ రూరల్‌: తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సూచించారు. బుధవారం మెదక్‌ మండలం మంభోజిపల్లి నుంచి అవుసులపల్లి వరకు 10కే రిలే వాకింగ్‌ను ప్రారంభించారు. అనంతరం అవుసులపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మా రుతున్న కాలానుగుణంగా సరికొత్త సాంకేతిక విద్యా విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నామని వివరించారు. కార్పొరేట్‌ పాఠశాలల కు ధీటుగా మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేష్‌, అదనపు ఎస్పీ మహేందర్‌, మెదక్‌ ఆర్డీఓ రమాదేవి, డీఈఓ రాధాకిషన్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, యువజన క్రీడల నిర్వహణ అధికారి, అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి సుదర్శనమూర్తి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తిలో భూ భారతి రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈనెల 10 తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 187 గ్రామాల్లో 10,933 దరఖాస్తులు స్వీకరించామన్నారు.

అయిల్‌పాం సాగుకు ఆసక్తి చూపండి

శివ్వంపేట(నర్సాపూర్‌): రైతులు అయిల్‌పాం సాగుకు ముందుకు రావాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని సీతారం తండాలో ఆయిల్‌పాం మొక్కలు నాటి మాట్లాడా రు. రైతులు ఒకే పంట విధానం కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందన్నారు. 2025– 26 సంవత్సరంలో 2,500 ఎకరాల్లో అయిల్‌పామ్‌ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అనంతరం రత్నాపూర్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఆయ న వెంట పలువురు అధికారులు ఉన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement