
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వివేక్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర కార్మిక, భూగర్భ గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నియమితులయ్యారు. ఇప్పటివరకు జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన కొండా సురేఖ స్థానంలో వివేక్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అమాత్య పదవి దక్కిన సంగతి తెలిసిందే. కేబినెట్లో బెర్త్ లభించిన వారంలోనే ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులు కావడం గమనార్హం.