మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్లో రికార్డుస్థాయి లో ధాన్యం కొను గోలు చేసినట్లు అదనపు కలెక్టర్ నగేష్ గురువారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 488 కొనుగోలు కేంద్రాల్లో పూర్తయినట్లు తెలిపారు. ప్రస్తుతం మరో 10 కేంద్రాల్లో కొంతమేర ధాన్యం మిగిలిఉందన్నారు. 80,045 మంది రైతుల నుంచి 3,19,460,480 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. ఇందుకుగానూ రూ.701 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. మరో 10 కొనుగోలు సెంటర్లలో మాత్రమే కొనుగోలు ముగింపుస్థాయిలో ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి అధికారిని అభినందించారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తూ రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ, గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో ధాన్యం సేకరించినట్లు పేర్కొన్నారు.
సదస్సులు సద్వినియోగం చేసుకోండి
చిన్నశంకరంపేట(మెదక్): భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. గురువారం మండలంలోని గవ్వలపల్లిలో రెవెన్యూ సదస్సును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈసందర్భంగా తహసీల్దార్ మన్నన్కు పలు సూచనలు చేశారు. అనంతరం నార్సింగి మండల కేంద్రంలోని రైతు సదస్సును పరిశీలించారు.
అదనపు కలెక్టర్ నగేష్