
ప్రభుత్వ బడుల బలోపేతానికి చర్యలు
పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నా రు. శుక్రవారం పెద్దశంకరంపేట, మల్కాపూర్ పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులకు నూతన దుస్తులు, పుస్తకాలు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బడీడు పిల్లలు బడిలో ఉండే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు విజయ్కుమార్, మారుతి, విఠల్, సత్యకుమార్ ఉపాధ్యాయులు రామకృష్ణాగౌడ్, సిద్దిరాములు, నాయకులు సురేందర్రెడ్డి, మధు, నారాగౌడ్, ఆర్ఎన్.సంతోష్, సంగమేశ్వర్, సుభాష్గౌడ్, గంగారెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి